రాష్ట్రీయం

హైదరాబాద్ డీఆర్‌ఎంగా సీతారామప్రసాద్ విజయవాడకు శ్రీనివాస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 22: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో హైదరాబాద్, విజయవాడ రైల్వే డివిజన్‌లకు మేనేజర్లను నియమిస్తూ సోమవారం రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ రైల్వే డివిజన్ మేనేజర్‌గా సీతారామప్రసాద్, విజయవాడ డివిజన్ మేనేజర్‌గా శ్రీనివాస్‌ను బదిలీ చేసినట్లు రైల్వే సీనియర్ అధికారులు వెల్లడించారు. సోమవారం వీరిద్దరు బాధ్యతలు చేపట్టారు.హైదరాబాద్ రైల్వే డివిజన్ మేనేజర్ సీతారామప్రసాద్ వరంగల్ ఎన్‌ఐటీలో విద్యాభ్యాసం చేశారు. ఈయన దేశంలో ఉన్న వివిధ రైల్వే డివిజన్లలో పని చేశారు. విజయవాడ డివిజన్ రైల్వే మేనేజర్ శ్రీనివాస్ ఐఆర్‌ఎస్‌ఈలో పట్ట్భద్రులు అయ్యారు. సికింద్రాబాద్ రైల్ నిలయంలో వివిధ హోదాల్లో పని చేశారు.
చిత్రాలు.. సీతారామప్రసాద్, శ్రీనివాస్