రాష్ట్రీయం

ఆసియాలోనే రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 24: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం మొదటి పంపు వెట్ రన్ విజయవంతం కావడం పట్ల ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హర్షం వ్యక్తం చేశారు. 105 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోసే పంపింగ్ అనుకున్న మేరకు లక్ష్యానికి చేరుకోవడం అత్యంత ఆనందకరమైందని సీఎం అభివర్ణించారు. ఇంతటి భారీ సామార్ధ్యం కలిగిన పంపులను విజయవంతంగా వినియోగించడం ద్వారా ఆసియా ఖండంలోనే ఈ ఘనత సాధించిన దేశంగా భారత్, ఏకైక రాష్ట్రంగా తెలంగాణ చరిత్రలో నిలువనుందన్నారు. ‘తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యను పరిష్కరించడమే లక్ష్యంగా మెదడును కరిగించాం. అనేక రకాల ఆలోచించాం. ఎంతో శోధించి, చివరికి ప్రాణహిత నది గోదావరిలో కలిసిన తర్వాత కాళేశ్వరం దగ్గర మాత్రమే నీటి లభ్యత ఉందని నిర్ధారించుకున్నాం. అక్కడి నుంచి నీటిని ఎత్తిపోయడం మినహా మర గత్యంతరం లేదని నిర్ణయానికి వచ్చాం. కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోసి తెలంగాణలో 40 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే బహృత్ ప్రణాళఇక తయారు చేయడానికి నెలల తరబడి కసరత్తు చేశాం. రక్షణ శాఖ అనుమతి తీసుకుని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ద్వారా లైడార్ సర్వే నిర్వహించాం. పక్కా అంచనాతో కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేశాం. గోదావరి నుంచి నీటిని తోడడానికి గతంలో ఎన్నడూ లేని విధంగా 124.2 మెగావాట్ల భారీ సామర్ద్యం కలిగిన పంపు సెట్లను వినియోగించడానికి డిజైన్ చేశాం. గతంలో తెలంగాణలో 80 నుంచి 85 మీటర్ల వరకు మాత్రమే నీటిని ఎత్తిపోసిన అనుభవం ఉంది. కానీ కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్కో పంపు గరిష్టంగా 120 మీటర్ల ఎత్తుకు నీటిని పంపింగ్ చేసే ప్రణాళిక ఉంది. ఈ ప్రణాళిక తయారు చేయడానికి, అమలు చేయడానికి ఇంజనీర్లు, అధికారులు విదేశాలకు కూడా వెళ్లారు. సంపూర్ణ అధ్యయనం చేసి, పూర్తి అవగాహనతో పనులు చేపట్టాం. భగవంతుడి ఆశీస్సుల వల్ల అన్నీ అనుకున్నది అనుకున్నట్టు జరిగాయి. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రైతల తలరాత మార్చే అదృష్టం. ప్రాజెక్టు పనుల్లో రేయింబవుళ్లు కష్టపడుతున్న అధికారులు, ఇంజనీర్లకు అభినందనలు’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.