రాష్ట్రీయం

‘ప్రధాని మోదీని చూసి ఓర్వలేకే కాంగ్రెస్ ఆరోపణలు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 11: ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో బీజేపీ గెలుపు తథ్యం కావడంతో ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ కుయుక్తులకు పాల్పడుతోందని బీజేపీ అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి ధ్వజమెత్తారు. మోదీ నాయకత్వానికి టైమ్ మ్యాగజైన్ సర్ట్ఫికేట్ అవసరం లేదన్నారు. ఈ కుట్రలో కాంగ్రెస్ పార్టీకి భాగస్వామ్యం ఉందన్నారు. శనివారం ఇక్కడ ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ, కాంగ్రెస్ పాలనలో భ్రష్టు పట్టిన ఆర్థిక వ్యవస్థను ఒక గాడిన తీసుకు వచ్చేందుకు ప్రధాని మోదీ సాహసోపేతమైన చర్యలు తీసుకున్నారన్నారు. ప్రతిపక్షపార్టీలకు ఒక నాయకుడు ఉన్నాడా, వారికి అజెండా ఉందా అని ప్రశ్నించారు. విపక్ష పార్టీలకు ఎంతసేపు అధికారం కోసం యావ తప్ప మరేమీ లేదన్నారు. ఆర్థిక రంగాన్ని ఉజ్వల దిశగా నడిపించేందుకు మోదీ చేసిన కృషిని ఇదే టైమ్ మ్యాగజైన్ గతంలో ప్రశంసించిన విషయాన్ని గుర్తు చేశారు.