రాష్ట్రీయం

నేడు కాంగ్రెస్ ఎమ్మెల్సీల ఖరారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు టీపీసీసీ కసరత్తును ముమ్మరం చేసింది. అభ్యర్థులను ఖరారు చేసే ముందు పార్టీ హైకమాండ్ ఆమోదం తీసుకోనున్నారు. వరంగల్ స్థానానికి వెంకటరామిరెడ్డి లేదా కొండా దంపతులు సురేఖ లేదా కొండా మురళి పేరును, నాయిని రాజేందర్ రెడ్డి పేరును కాంగ్రెస్ పార్టీ పరిశీలిస్తోంది. నల్లగొండ ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మి పేరుతో పాటు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి భార్య మాజీ ఎమ్మెల్యే పద్మావతి పేర్లను, పటేల్ రమేష్డ్ పేర్లను పరిశీలిస్తున్నారు. రంగారెడ్డి స్థానానికి మేడ్చెల్ మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్, పరిగి రామ్మోహన్ రెడ్డి పేర్లను పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మల్ రెడ్డి రంగారెడ్డికి టిక్కెట్ ఇచ్చేందుకు పార్టీ సుముఖంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అభ్యర్థులను సోమవారం ప్రకటించే అవకాశం ఉంది.