రాష్ట్రీయం

పులివెందులకు జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పులివెందుల, మే 14: జిల్లాలో రెండురోజుల పర్యటన నిమిత్తం వైకాపా అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం రాత్రి కడప జిల్లా పులివెందులకు చేరుకున్నారు. కడప మాజీ ఎంపీ వైఎస్.అవినాష్‌రెడ్డి ఆధ్వర్యంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు జగన్‌కు ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్ నుంచి విమానంలో కడపకు వచ్చిన జగన్ అక్కడి నుంచి రోడ్డుమార్గంలో పులివెందుల చేరుకున్నారు. బుధవారం ఉదయం పులివెందులలోని తన క్యాంప్ కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలు, బూత్ స్థాయి కన్వీనర్లతో జగన్ సమావేశం నిర్వహించి ఓటింగ్ సరళిని కేంద్రాల వారీగా తెలుసుకోనున్నారు. సాయంత్రం విజే ఫంక్షన్‌హాలులో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయనున్నారు. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజాదర్బార్ ఏర్పాటుచేసి నియోజకవర్గం ప్రజల సమస్యలు తెలుసుకుంటారు. అదేరోజు సాయంత్రం హైదరాబాద్‌కు తిరిగివెళ్తారు.

చిత్రం...పులివెందుల చేరుకున్న జగన్‌కు స్వాగతం పలుకుతున్న పార్టీ శ్రేణులు