రాష్ట్రీయం

సహస్రాబ్దుల అస్తిత్వం.. తెలంగాణకే ప్రత్యేకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాతరాతి యుగం నుండి ఉనికిని కలిగి, పూర్వ రాతియుగ కాలపు ఆవాస స్థానాలకు నిలయమై, బృహశ్శిలా యుగపు ఆనవాళ్ళను సంతరించుకుని, షోడశ మహా జనపదాలలో దక్షిణాది ప్రాంత ఏకైక ఆశ్మక జనపథాన్ని అంతర్భాగంగాకలిగి, అఖండ భారతావనిలో ప్రత్యేక స్థానం కలిగి ఉన్నది తెలంగాణ ప్రాంతం. బుద్ధుని కాలాన బోధన్ పాలకునిగా సుజాతుడు ఉన్నట్లు, బుద్ధుని సమకాలికుడైన బావరి బావనకుర్తిలో స్థిర పడినట్లు, మత్స్య పురాణాధారంగా మంజీరా నది ప్రస్తావన, పైఠాన్ రాజధానిగా ఉత్తర - దక్షిణాలకు ప్రధాన మార్గాన్ని కలిగిన ములక రాజ్యం గోదావరి హద్దు వరకు విస్తరించినట్లు, మగధ రాజ్యం బలపడ్డాక, ఆశ్మక సైతం మగధలో విలీనమైనట్లు చరిత్రకారులు నిరూపించడం సామాన్యమేమీ కాదు. నందుల కాలానంతరం వౌర్యుల హయాంలో పర్యటించిన చీనా యాత్రికుడు మెగస్తనీసు పేర్కొన్న 30బలిష్ఠ దుర్గాలలో కదంబాపూర్, బోధన్, పిధుండ, ముషిక, ధూళికట్ట, పెద్దబొంకూరు, పణిగిరి, కొండాపూర్, ముఖ్యంగా శాతవాహన ఛక్రవర్తుల తొలి రాజధాని కోటిలింగాలలు చోటు చేసుకోవపాన్ని బట్టి ఈ ప్రాంత చారిత్రక ప్రాధాన్యత స్పష్టం అవుతున్నది. శాతవాహనుల అనంతరం తెలంగాణ మొత్తాన్ని పాలించిన రాజ్యం లేకపోగా, ఇక్ష్వాకుల పాలనలో తూర్పు ప్రాంతాలు విజయపురి రాజధానిగా, వాకాటుల ప్రారంభ కాలంలో ఉత్తర తెలంగాణ ఉండగా, వ్రవర సేనుడి కాలాన తెలంగాణ మొత్తం సదరు రాజన్యుల ఏలుబడికి రాగా, తర్వాతి విష్ణుకుండినుల జన్మభూమి తెలంగాణమే అని బి.ఎన్.శాస్ర్తీ నిరూపిత అంశాలు, బాదామి చాళుక్యుల పాలనలో తెలంగాణ మొత్తం ఉండగా, రాష్టక్రూట, బాదామి చాళుక్య, కందూరి చోళ, కాకతీయ కుతుబ్‌షాహీల ఏలుబడులలో ఎన్నో ఒడిదొడుకులు అనుభవించి, తన ఉనికిని చేటుకున్నదీ నేల. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం సిద్ధించినా, నిజాం పాలనలో ఉన్న ఈ ప్రాంతం స్వేచ్ఛా వాయువులు పీల్చ జాలక పోయింది. 1948 సెప్టెంబర్ 17న పోలీస్ చర్య ఫలితంగా తెలంగాణ విమోచనోద్యమానికి ముగింపుగా, భారతావనిలో అంతర్భాగమైంది. 1724-1948మధ్యకాలం 224 సంవత్సరాల పాటు 8తెలంగాణ జిల్లాలు, 5మరట్వాడా జిల్లాలు, 3కర్నాటక జిల్లాలతో కలిపి 16జిల్లాల హైదరాబాద్ రాష్ట్రం మూడు భాషలతో కొనసాగింది. 1948 సెప్టెంబర్ 13న పోలీసు చర్య ఫలితంగా 17న మీర్ ఉస్మాన్ అలీఖాన్ లొంగి పోవడంతో హైదరాబాద్ రాష్ట్రం భారతదేశ ప్రభుత్వ పాలనలో విలీనమైంది. వరంగల్ నుండి కొంత ప్రాంతం, గోదావరి జిల్లాల నుండి భద్రాచలం, దండకారణ్య ప్రాంతం వేరు చేస్తూ, ఖమ్మం జిల్లాను రూపొందించారు. 1948నుండి 52వరకు ప్రజాస్వామ్య ప్రభుత్వం లేని కారణాన మిలిటరీ, సివిల్ అధికారుల పాలనలో ఇంగ్లీషు భాష రాదన్న సాకుతో మదరాసు రాష్ట్రంలోని ఆంధ్రపాత్రం నుండి ముల్కీ నిబంధనలను ఉల్లంఘించి అధిక సంఖ్యాకులకు ఉద్యోగాలు కల్పించడం జరిగింది. 1956లో ఆంధ్రరాష్ట్రం, హైదరాబాద్ రాష్ట్రంలో విలీనమైనాక వలసలు మరింత అధికమైనాయి. నిజాం పాలనలో ఉత్తరాది వారికే ఉద్యోగాలలో పెద్దపీట వేసిన నేపథ్యంలో, స్థానికులకు ఉద్యోగావకాశాలు దక్కాలని 1910-18 మధ్యకాలంలో పెద్ద ఎత్తున ఉద్యమించిన ఫలితంగా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1919లో ముల్కీ నిబంధనలను ప్రవేశ పెట్టారు. స్వార్థ రాజకీయ పాలనల ఫలితంగా ఇది అమలు కాని స్థితిలో 1969లో మర్రి చెన్నరెడ్డి నేతృత్వంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉధృతమైంది. 1969 జనవరి 5న తెలంగాణ ఉద్యోగులు, ఖమ్మం జిల్లా పాల్వంచలోని ధర్మల్ స్టేషన్‌లో పని చేస్తున్న ఉద్యోగులలో అధికులు ఆంధ్రావారు కావడంతో నిరసనలకు దిగారు. తెలంగాణ రక్షణలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రక్షణ సమితి ఆధ్వర్యంలో పలు తీర్మానాలు చేశారు. ఉద్యమంలోనికి ఉస్మానియా విద్యార్థులు ప్రవేశించారు. జనవరి 13న ఉస్మానియాలో తెలంగాణ విద్యార్థుల కార్యాచరణ సమితి రూపుదాల్చింది. మెడికల్ విద్యార్థి మల్లిఖార్జున్‌ను నాయకునిగా ఎన్నుకున్నారు. జనవరి 20న తొలిసారి విద్యార్థులపై కాల్పులు జరిగాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జస్టిస్ భార్గవ కమిటీని వేసింది. జనవరి 22న తెలంగాణ రక్షణల అమలుకు జీవో జారీ చేసింది. ఫిబ్రవరి 28లోగా నాన్ ముల్కీ ఉద్యోగులను తిరిగి పంపుతామని, జీవోను నిర్లక్ష్యం చేసే అధికారులపై కొరడా ఝళిపిస్తామని హెచ్చరించింది. జనవరి 24న సదాశివ పేటలో జరిగిన కాల్పులలో 14మంది మరణించారు. గాయపడి, గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందిన 17సంవత్సవాల శంకర్ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడైనాడు. కాల్పులకు నిరసనగా కొండా లక్ష్మణ్ బాపూజీ రాజీనామా చేశారు. జూన్ 4న ఇందిరా గాంధీ స్వయాన హైదరాబాద్ వచ్చి విద్యార్థి, ప్రజా సమితి నేతలతో చర్చలు జరిపారు. ఉద్యమంలో 369మంది అసువులు బాయగా, 57మందిగా పేర్కొన్నారు. ప్రజాబలం పునాదిగా, ముఖ్యంగా విద్యార్థుల ఉద్యమాల ఫలితంగా 1971లో 12కు 11 లోకస్థానాలు సాధించిన తెలంగాణ ప్రజా సమితి (టిపిఎస్), ఆపై ఇందిరాగాంధీతో చర్చల అనంతరం కాంగ్రెస్‌లో విలీనమైంది. 1979లో హైదరాబాద్ నుండి వేరై రంగారెడ్డి నూతనంగా జిల్లా అయింది. 2001లో కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రత్యేక రాష్ట్ర లక్ష్య సాధనతో తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించి, అకుంఠిత కార్యదీక్షా దక్షులై, తెలంగాణలోని మేధావుల సహకారంతో, తెలంగాణకు జరిగిన, జరుగుతున్న అన్యాయాన్ని ఈ ప్రాంత వాసులకు వివరించి, చైతన్యవంతులను చేసే కార్యక్రమంలో సఫలీకృతులైనారు. ఆయన కార్యదీక్షా దక్షతకు, తోడుగా 2011లో ఏర్పాటైన రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి సహకారంతో విద్యార్థులు, ఉద్యోగులు, మేథావులు, రచయితలు, కవులు, కళాకారులు, ఆత్మబలిదానాలు, వెరసి, సబ్బండ వర్ణాల ఆకాంక్షలు బహిర్గతమై, అధికార కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులూ తమతమ లాబీల ద్వారా ఢిల్లీలోనూ చేసిన ఆం దోళనలు వెరసి, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. 2009 డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైనట్లు యూపీఏ ప్రభుత్వం ప్రకటించింది. 2010లో శ్రీకృష్ణ కమిటీ నియమితమై, 6ప్రతిపాదనలు సిఫార్సు చేసింది. 2009 డిసెంబర్ 3న మలిదశ ఉద్యమంలో ప్రత్యేక రాష్ట్రంకోసం ఆత్మత్యాగం చేసిన తొలి అమరుడు శ్రీకాంతాచారి. 2011లో 42రోజుల పాటు ఉద్యోగులు, కార్మికులు, సకల జనుల సమ్మె, అనంతరం మిలియన్ మార్చ్ జరిగాయి. 2013 జూలై 30న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానించగా, 2013 అక్టోబర్ 3న కేంద్ర మంత్రి మండలి ఆమోదముద్ర వేసింది. 2014 జూన్ 2న దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావం జరిగింది.

- సంగనభట్ల రామకిష్టయ్య