రాష్ట్రీయం

హైదరాబాద్ శివార్లలో ఐదు కొత్త మున్సిపాలిటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 11: హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కొత్తగా ఐదు మున్సిపాలిటీల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. గ్రామ పంచాయతీలను డి నోటిఫై చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో డి నోటిఫై అయిన గ్రామాలు మున్సిపాలిటీలుగా మారేందుకు మార్గం సుగమం అయింది. కొత్తగా బోడుప్పల్, పీర్జాదిగూడ, మీర్‌పేట, జిల్లెలగూడ, జల్‌పల్లి మున్సిపాలిటీలు ఏర్పాటు కానున్నాయి. కొత్తగా ఏర్పాటయ్యే జల్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలో జల్‌పల్లి, కొత్తపేట, పహాడీషరీఫ్, బాలాపూర్ పంచాయతీలు వస్తాయి. మీర్‌పేట, జల్లెలగూడను మున్సిపాలిటీలుగా డి నోటిఫై చేశారు. ఇక బోడుప్పల్ పరిధిలోకి బోడుప్పల్, చెంగిచెర్ల, గ్రామ పంచాయతీలు వస్తాయి. పీర్జాదిగూడ మున్సిపాలిటీ పరిధిలోకి మేడిపల్లి, పర్వతాపూర్, పీర్జాదిగూడ పంచాయతీలు వస్తాయి.