రాష్ట్రీయం
అసదుద్దీన్ ప్రాసిక్యూషన్కు గ్రీన్ సిగ్నల్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 12 April 2016
హైదరాబాద్, ఏప్రిల్ 11: ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీని ప్రాసిక్యూట్ చేసేందుకు తెలంగాణ రాష్ట్రప్రభుత్వం హైకోర్టుకు ఆమోదం తెలిపింది. తాత్కాలిక ప్రధానన్యాయమూర్తి జస్టిస్ దిలిప్ బి బోసలే, జస్టిస్ పి నవీన్రావులతో కూడిన హైకోర్టు డివిజన్ బెంచ్కు హోంశాఖ కౌన్సిల్ వేణుగోపాల్ ఈ విషయాన్ని సోమవారం వివరించారు. నిజామాబాద్, నిర్మల్ పోలీసులు నమోదు చేసిన కేసుల్లో అసదుద్దీన్ను ప్రాసిక్యూట్ చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని అన్నారు. నిజామాబాద్ పోలీసులు ఇప్పటికే చార్జిషీట్ కూడా దాఖలు చేశారని ఆయన వివరించారు. ప్రభుత్వ వాదన విన్న తర్వాత హైకోర్టు సయ్యద్ తారిక్ ఖాద్రీ దాఖలు చేసిన పిటీషన్ను కొట్టివేసింది.