రాష్ట్రీయం
అధికారుల తీరుతో నష్టపోయాం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 4 June 2019
విజయవాడ, జూన్ 3: అధికారుల వైఫల్యం కారణంగా నష్టపోయిన తమకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి డీఎస్సీ 2018 అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. తాడేపల్లిలోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రిని సోమవారం డీఎస్సీ 2018 అభ్యర్థులు కలిశారు. అధికారుల వైఫల్యంతో తమకు అన్యాయం జరిగిందని డీఎస్సీ అభ్యర్థులు తెలిపారు. అధికారుల తప్పులకు 3 వేల మంది రోడ్డున పడ్డామన్నారు. పరీక్షను 8 రోజుల పాటు 16 సెషన్లలో నిర్వహించడం వల్ల కాఠిన్యత మారిపోయిందని వివరించారు. తక్షణమే నార్మలైజేషన్ పద్ధతిని అమలు చేసి సెలక్షన్ లిస్టు విడుదల చేయాలని కోరారు. సాక్షర భారత్ ఉద్యోగులు కూడా జగన్ను కలిశారు. తమను తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు చర్యలు తీసుకోవాలని, పాదయాత్రలో ఇచ్చిన హామీని గుర్తు చేశారు.