రాష్ట్రీయం

నేడు ముంబయికి సీఎం కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శుక్రవారం ముంబయి వెళ్తున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించనున్న విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం 10.20 గంటలకు హైదరాబాద్ నుంచి విమానంలో బయలుదేరి ముంబాయికి చేరుకుంటారు. మొదట రాజ్‌భవన్‌కు వెళ్లి మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావును మర్యాదపూర్వకంగా కలుసుకుంటారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 2 గంటలకు సీఎం అధికార నివాసానికి వెళ్లి ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌తో సమావేశం అవుతారు. ఈ నెల 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి హాజరు కావాల్సిందిగా ఆహ్వాన పత్రాన్ని అందజేస్తారు.