రాష్ట్రీయం

ముత్యపు కవచంలో మురిపించిన శ్రీమలయప్ప

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: తిరుమల శ్రీవారి వార్షిక జ్యేష్ఠ్భాషేకంలో భాగంగా రెండవ రోజు శనివారం నాడు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ముత్యపు కవచం ధరించి నాలుగు మాడవీదుల్లో ఊరేగుతూ భక్తులను మురిపించాడు. అంతకుముందు ఉదయం 6.30గంటలకు శ్రీమలయప్పస్వామి వారు ఉభయనాంచారులతో కలసి శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారానికి వేంచేపు చేశారు. ఉదయం 8గంటలకు ఆలయ అర్చకులు , వేదపారాయణదారులు శాస్త్రోక్తంగా మహాశాంతి హోమం నిర్వహించారు. అనంతరం ఉదయం 9 నుండి 11గంటల వరకు శ్రీమలయప్పస్వామి వారికి, దేవేరులకు అభిదేయక అభిషేకాన్ని కన్నులపండుగగా చేపట్టారు. సాయంత్రం శ్రీమలయప్పస్వామివారికి ముత్యపు కవచ సమర్పణ వేడుకగా జరిగింది. అనంతరం సహస్రదీపాలంకార సేవలో ఊయలమీద స్వామి ముత్యపు కవచంలో భక్తులను అనుగ్రహించారు. కాగా సంవత్సరంలో ఒకమారు మాత్రమే ముత్యపు కవచాన్ని ధరించిన స్వామివారి ముగ్దమనోహర రూపాన్ని చూసి భక్తులు తన్మయత్వం చెందారు. ఈ కారణంగా ఆర్జిత వసంతోత్సవ సేవను టీటీడీ రద్దు చేసింది. ఈ కార్యక్రమంలో ఆలయ పేష్కార్ లోకనాథం, పార్‌పత్తేదార్ రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.
చిత్రం...ముత్యపు కవచం ధరించి మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తున్న శ్రీ మలయప్పస్వామి