రాష్ట్రీయం

ఆకాశవాణి శ్యామలాదేవి ఇకలేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఆకాశవాణి విశ్రాంత నాటక ప్రయోక్త, స్ట్ఫా ఆర్టిస్ట్ ఎంజీ శ్యామలాదేవి (88) సోమవారం హైదరాబాద్‌లో మరణించారు. కృష్ణా జిల్లాకు చెందిన శ్యామలాదేవి తొలుత ఆకాశవాణి విజయవాడ కేంద్రంలోనూ ఆ తర్వాత హైదరాబాద్‌లో పని చేశారు. ప్రధానంగా కన్యాశుల్కం నాటకంలో బుచ్చమ్మగా ఆమె నటన ఎన్నో తరాల శ్రోతలను ఆకట్టుకుంది. ఆమె ఎన్నో నాటికల్లో ముఖ్యపాత్రలు వేశారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసారం చేసే ఉదయ తరంగణి కార్యక్రమంలో ఆమె పోషించిన అమ్మ పాత్ర ఎంతో ప్రాచుర్యం పొందింది. శ్యామలాదేవికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. వీరి మృతి పట్ల విజయవాడ ఆకాశవాణి సిబ్బంది సంతాపం వ్యక్తం చేశారు.