రాష్ట్రీయం

ఎస్వీబీసీ చైర్మన్‌గా సినీ నటుడు పృధ్వీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ : వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికల సమయంలో ఆ పార్టీ గెలుపు కోసం విస్తృత ప్రచారం చేసిన సినీ హాస్యనటుడు పృథ్వీకి కీలక పదవి లభించింది. తిరుమల శ్రీవారి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటుతున్న శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ)కు చైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ మేర రేపోమాపో ఉత్తర్వులు వెలువడనున్నాయి. టీడీపీ హయాంలో ఎస్వీబీసీకి సినీ దర్శకుడు రాఘవేంద్రరావు చైర్మన్‌గా వ్యవహరించారు. జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాఘవేంద్రరావు తన పదవికి రాజీనామా చేశారు. రాఘవేంద్రరావు దేవస్థాన ధర్మకర్తల మండలిలో సభ్యులుగా ఉంటూనే ఛానల్ బాధ్యతలు నిర్వర్తించారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పృధ్వీ తన సొంత జిల్లాలో జగన్ పాదయాత్ర సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరి ఆ తర్వాత రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఇలాఉంటే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని పృథ్వీ శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు.

చిత్రం...ముఖ్యమంత్రి జగన్‌ను కలిసిన సినీనటుడు పృథ్వీ