రాష్ట్రీయం
రాష్ట్రం కోసం కష్టపడ్డా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 16 July 2019
విజయవాడ: ముఖ్యమంత్రులు విదేశాల్లో పర్యటించకపోతే పెట్టుబడులు వస్తాయా అని చంద్రబాబు సోమవారం శాసనసభలో ప్రశ్నించారు. గడచిన ఐదేళ్లలో చంద్రబాబు రూ.39 కోట్ల ప్రజాధనంతో 38 విదేశీ పర్యటనలు జరిపారని, వీటివల్ల రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని వైసీపీ సభ్యులు తీవ్ర విమర్శలు గుప్పించారు. వీటిని చంద్రబాబు తిప్పికొట్టారు. రాష్ట్భ్రావృద్ధి కోసం దేశ విదేశాల్లో ఉన్నా కూడా రాత్రి, పగలు నిద్రాహారాలు లేకుండా నీతి నిజాయతీతో శ్రమించానన్నారు. తన కృషివల్ల ఈ రాష్ట్రంలో 39,450 చిన్న తరహా పరిశ్రమలు రాగా వాటిల్లో 5,13,531 మందికి ఉపాధి లభించిందని అన్నారు. మొత్తంపై రూ.16 లక్షల కోట్లతో ఎంవోయులు జరిగాయి. వీటివల్ల 32 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని అన్నారు.