రాష్ట్రీయం

పిడుగుపాటుకు ముగ్గురు దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, జూలై 18: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం ఉరుములతో కురిసిన వర్షంతోపాటు పిడుగులు పడిన వేర్వేరు సంఘటనలో పత్తి రైతుతోపాటు ఇద్దరు మహిళా వ్యవసాయ కూలీలు దుర్మరణం చెందారు. బూర్గంపహాడ్ మండల పినపాక పట్టినగర్‌లో పొలంలో వ్యవసాయ పనులు చేస్తున్న దోమల సుందర్ (40)పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. పొలం పనులు చేస్తున్న దుక్కిటెడ్లు కూడా రైతుతోపాటు మృత్యువాత పడ్డాయి. ఇదే ప్రాంతానికి సమీపంలో పాతనాగారానికి చెందిన శ్రీను, ముత్తయ్యలు మేకలను మేతకు తోలుకెళ్లగా పిడుగు పడటంతో 15 మేకలు అక్కడికక్కడే మృతి చెందాయి. అదే విధంగా టేకులపల్లి మండలం కొప్పురాయి పంచాయతీ పరిధిలోని ఒడ్డుగూడెం గ్రామానికి చెందిన బంద అనూష (25), అదే పంచాయతీ బర్లగూడెంకు చెందిన తెల్లబోయిన రవళి (26) పత్తి చేలో పనిచేస్తుండగా పిడుగుపాటుకు గురై మృతి చెందారు.