రాష్ట్రీయం

వృద్ధులు, దివ్యాంగులకు 23, 24న ప్రత్యేక దర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూలై 18: శ్రీవారి దర్శనం కోసం వచ్చే వయోవృద్ధులు, దివ్యాంగులు, ఐదేళ్లలోపు చంటిపిల్లల తల్లితండ్రులకు ప్రతినెలా రెండు సామాన్య దినాల్లో ప్రత్యేక దర్శనాలు కల్పిస్తోంది. అందులో భాగంగా ఈనెల 23న 65సంవత్సరాలు నిండిన వయోవృద్ధులకు, దివ్యాంగులకు నాలుగువేల టోకెన్లు జారీ చేయనుంది. ఉదయం 10గంటల స్లాట్‌కు వెయ్యి, మధ్యాహ్నం రెండుగంటల స్లాట్‌కు రెండువేల టోకెన్లు, మూడుగంటల స్లాట్‌కు వెయ్యి టోకెన్లు జారీచేస్తారు. వృద్ధులు, దివ్యాంగులు రద్దీ రోజుల్లో తిరుమలకు వచ్చి ఇబ్బంది పడకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ గురువారం ఒక ప్రకటనలో కోరింది. ఎస్వీ మ్యూజియం ఎదురుగా ఉన్న కౌంటర్ల వద్ద వృద్ధులు, దివ్యాంగులకు ప్రతిరోజూ 1400 టోకెన్లు జారీ చేస్తున్నారు. ఇక్కడ ఉదయం ఏడుగంటల నుంచి ప్రారంభించి రెండుస్లాట్లకు సంబంధించిన టికెట్లు కేటాయిస్తారు. దీనివల్ల భక్తులు ముందుగా వచ్చి టికెట్ల కోసం వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. ఆ తరువాత ఉ. 10గంటలకు, మ. 3 గంటలకు ప్రత్యేక క్యూలైన్ ద్వారా స్వామివారి దర్శనం కల్పిస్తారు. ఐదేళ్లలోపు పిల్లలను వారి తల్లితండ్రులను ఈనెల 24వ తేదీ ఉ. 9నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు సుపథం ద్వారా దర్శనానికి అనుమతిస్తారు.