రాష్ట్రీయం

ముఖ్యమంత్రి జగన్‌కు డిప్లమాటిక్ పాస్‌పోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 20: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన సతీమణి భారతి శనివారం నగరంలోని ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయానికి వచ్చి డిప్లొమాటిక్ పాస్‌పోర్టును అందుకున్నారు. ముఖ్యమంత్రి హోదా ఉన్న వారికి విదేశాంగ శాఖ డిప్లమాటిక్ పాస్‌పోర్టును జారీ చేస్తుంది. గతంలో ఇదే పాస్‌పోర్టును అందుకున్న చంద్రబాబు నాయుడు ఎన్నికల అనంతరం దాన్ని తిరిగి అధికారులకు అప్పగించారు. ఇప్పటి వరకు సాధారణ పాస్‌పోర్టు కల్గిన జగన్ మున్ముందు విదేశీ ప్రయాణాల సమయంలో ప్రొటోకాల్‌ను వర్తింప చేసేందుకు ఈ డిప్లమాటిక్ పాస్‌పోర్టు పని చేస్తుంది. జగన్ దంపతులు కార్యాలయంలో తమ చేత వేలిముద్రలు ఇతర వివరాలను అక్కడి అధికారులకు ఇచ్చారు. ఇదిలా ఉండగా ఆగస్టు 15వ తేదీ తర్వాత ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి అమెరికా వెళ్లబోతున్నారు. అక్కడ వైకాపా ఎన్‌ఆర్‌ఐ విభాగం నిర్వహించే సదస్సుకు జగన్ హాజరుకానున్నారు.
చిత్రం... డిప్లమాటిక్ పాస్‌పోర్టు తీసుకునేందుకు విజయవాడలోని ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయానికి వచ్చిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి