రాష్ట్రీయం

బలపడ్డ రుతుపవనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 20: తెలంగాణలో నిన్నటి వరకు బలహీనంగా ఉన్న నైరుతీ రుతుపవనాలు ఇప్పుడు బలపడ్డాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితలద్రోణి ప్రభావం ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలో కూడా ప్రభావం చూపిస్తోంది. దీంతో నైరుతీరుతుపవనాలు బలపడ్డాయని వెల్లడించారు. కామారెడ్డి, నిజామాబాద్, కుమరంబీం, మెదక్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వానలు కురిశాయి. ఉత్తర తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిశాయి. తాడ్వాయి (కామారెడ్డి) లో 14 సెంటీమీటర్లు, బోధన్ (నిజామాబాద్), ఎల్లారెడ్డి (కామారెడ్డి), పాపన్నపేట (మెదక్) ధర్పల్లి (నిజామాబాద్) లలో 13 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. ఉత్తర తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో 10 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. ఆదివారం, సోమవారం కూడా తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు.