రాష్ట్రీయం

తిరుమలలో నేటి నుంచి పవిత్రోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఆగస్టు 10: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం నుంచి పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం అంకురార్పణ కార్యక్రమంలో భాగంగా ఆచార్య రుత్విక్‌వరణాన్ని అర్చకస్వాములు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి పాల్గొన్నారు. శ్రీవారి మూలవిరాట్ ఎదుట ఆచార్య రుత్విక్‌వరణం నిర్వహించారు. ఇందులో భాగంగా భగవంతుని ఆజ్ఞ మేరకు అర్చకులకు బాధ్యతలు అప్పగించారు. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికులు, సిబ్బంది వల్ల తెలిసి, తెలియక జరిగే కొన్ని
దోషాల వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఈ పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 తతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయి. దీనిని 1962వ సంవత్సరం నుంచి దేవస్థానం పునరుద్ధరించింది. ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు పవిత్ర ప్రతిష్ఠ, రెండో రోజు పవిత్ర సమర్పణ, చివరి రోజు పూర్ణాహుతి నిర్వహిస్తారు. మూడు రోజులపాటు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 6 గంటల వరకు ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. ఈ సందర్భంగా మూడు రోజులపాటు విశేష పూజ, అష్టదళ పాదపద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, పేష్కార్ లోకనాథం ఇతర అధికారులు పాల్గొన్నారు.