రాష్ట్రీయం

బాబు మెప్పుకోసం బుద్దా ఆరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ : చంద్రబాబు నాయుడిపై రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేయడం ఆపకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ప్రకటించడం.. చంద్రబాబు మెప్పు కోసమేనని మంత్రి అనిల్ కుమార్ విమర్శించారు. సోమవారం వెలగపూడి సచివాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ.. బుద్దా వ్యాఖ్యలపై స్పందించారు. ‘వాళ్లు అత్మహత్యలు చేసుకునేదీ లేదు.. మనం చూసేదీ లేదు’ అంటూ వ్యాఖ్యానించారు. ప్రకాశం బ్యారేజీకి ఒక్కసారి మాత్రమే గరిష్ఠంగా 8 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చిందని.. ఎవరి ఇంటినో ముంచాలన్న ఉద్దేశం తమకు లేదని మంత్రి స్పష్టం చేశారు. నిజంగా చంద్రబాబు ఇంటిని ముంచాలంటే 8కి బదులు 12 లక్షల క్యూసెక్కులు విడుదల చేసేవారమని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఇంటిపై డ్రోన్ తిరగడంపై కోర్టుకు వెళ్లవచ్చని టీడీపీ నేతలకు సూచించారు.