రాష్ట్రీయం
ముంబయి-కొయంబత్తూర్ రైలు రద్దు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 20 August 2019
హైదరాబాద్, ఆగస్టు 19: ముంబయి - కొయంబత్తూరు (11013) మధ్య నడిచే కుర్లా ఎక్స్ప్రెస్ రైలును ఈనెల 23వ తేదీ వరకు రద్దు చేసినట్లు ద.మ రైల్వే అధికారులు తెలిపారు. కొయంబత్తూరు - ముంబయి ( 11014) వెళ్ళే కుర్లా రైలును ఈనెల 25వ తందీ వరకు రద్దు చేశారు. గద్వాల - రాయచూరు మధ్య నడిచే ( 77689- 77690 ) డెమో రైళ్ల సమయాలను మార్చారు. కొత్తగా సమయాలను ఈనెల 22వ తేదీ నుంచి అమలు చేస్తామని రైల్వే అధికారులు తెలిపారు. రాయచూరులో మధ్యాహ్నం 1.30 గంటలకు సమయానికి కాకుండా ఇంకాస్త ముందుకు మధ్యాహ్నం 12.55 గంటలకు బయలుదేరి 2.30 గంటలకు గద్వాల చేరుకుంటుంది. గద్వాలలో మధ్యాహ్నం 2.50 గంటలకు బయలుదేరిన రైలు సాయంత్రం 4.30 గంటలకు రాయచూరుకు చేరుకుంటుందని అధికారులు తెలిపారు.