ఆంధ్రప్రదేశ్‌

3500 దుకాణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రాష్ట్రంలో మద్యం దుకాణాలకు సంబంధించి కొత్త ఎక్సైజ్ విధానాన్ని గురువారం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 వరకూ ఈ విధానం అమల్లో ఉంటుంది. రాష్ట్రంలో 3500 దుకాణాలు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. ఈ దుకాణాలను ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ నిర్వహిస్తుంది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ దుకాణాల పని వేళలుగా నిర్ణయించింది. ఆగస్టు 15, జనవరి 26, అక్టోబర్ 2లను డ్రైడేలుగా ప్రకటించింది. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి ఆర్టీసీ బస్టాండ్, లీలామహల్ సర్కిల్, నంది సర్కిల్, విష్ణు నివాసం, శ్రీనివాసం మీదుగా అలిపిరికి వెళ్లే దారిలో మద్యం దుకాణాల ఏర్పాటును నిషేధించింది.