రాష్ట్రీయం
తీరంలో మెరైన్ పోలీసుల హై అలర్ట్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 13 September 2019
విజయవాడ, సెప్టెంబర్ 12: రాష్ట్రంలోని సముద్ర తీర ప్రాంతాల్లో మెరైన్ పోలీసులు అప్రమత్తమయ్యారు. కేంద్ర నిఘా వర్గాల ఆదేశాల మేరకు మెరైన్ పోలీసులు విస్తృతంగా గస్తీ నిర్వహిస్తున్నారు. మత్స్యకార బోట్లపై నిఘా పెంచారు. అపరిచితులు సంచారం కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని మత్స్యకారులను ఆదేశించారు. తీరగ్రామాల్లో మత్స్యకారులకు అవగాహనా సదస్సులు నిర్వహిస్తున్నారు. వేటకు వెళ్లే, తిరిగి వస్తున్న బోట్లను నిశితంగా పోలీసులు గమనిస్తున్నారు. మత్స్యకారుల వివరాలు, సముద్రంలోని పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. కొత్త బోట్లు ఏమైనా వచ్చాయా అనమానాస్పదంగా ఏవైనా బోట్లు తిరుగుతున్నాయా అన్న అంశాలపై ఆరా తీస్తున్నారు.