రాష్ట్రీయం

కేసీఆర్ దిగ్భ్రాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పాపికొండల వద్ద జరిగిన లాంచీ ప్రమాదం పట్ల ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, కేంద్ర మంత్రి జి కిషన్‌రెడ్డి వేర్వేరు ప్రకటనల్లో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు సీఎం ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మృతుల్లో తెలంగాణవాసులు కూడా ఉండటంతో అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ. ఐదు లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. సహాయక చర్యల్లో పాల్గొనాల్సిందిగా రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ను ఆదేశించారు. హుటాహుటిన వెళ్లి మృతుల కుటుంబాలకు అండగా నిలవాలని, అంత్యక్రియలు, ఇతరత్రా కార్యక్రమాలలో పాల్గొనాల్సిందిగా మరో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును, ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌ను సీఎం ఆదేశించారు.