రాష్ట్రీయం

టీడీపీతో పొత్తు ప్రసక్తే లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ): కనీస రాజకీయ విలువలు లేని పార్టీ దేశంలో ఎదైనా ఉంది అంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీనేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు వెంపర్లాడుతున్నారని శనివారం ట్విట్టర్‌లో కన్నా పేర్కొన్నారు. రానున్న రోజుల్లో బీజేపీ రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయ విలువలు లేని టీడీపీతో ఎప్పటికీ పొత్తు పెట్టుకోబోమని స్పష్టం చేశారు. టీడీపీకి అమిత్‌షా ఎప్పుడో శాశ్వతంగా తలుపులు మూసేశారని తెలిపారు. అవినీతే అజెండాగా అవకాశవాద రాజకీయాలతో యూటర్న్‌లు తీసుకుంటూ దేశ రాజకీయాల్లో విలువలను దిగజార్చిన పార్టీగా టీడీపీని కన్నా అభివర్ణించారు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని పొత్తుకోసం వెంపర్లాడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.

*చిత్రం...బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ