రాష్ట్రీయం
చిన్న శేష వాహనంపై పద్మావతి అమ్మవారి విహారం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 9 December 2015
తిరుచానూరు, డిసెంబర్ 8: పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజైన మంగళవారం రాత్రి అమ్మవారు పరమపద నాథుడి అవతారంలో చిన్నశేష వాహనం అధిష్ఠించి తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తుల కోలాటాలు, గోవింద నామస్మరణలు, మంగళవాయిద్యాలు, మంత్రోచ్చారణల మధ్య అమ్మవారు చిద్విలాసంగా తిరుమాడ వీధుల్లో ఊరేగారు. సాయంత్రం ఊంజల్ సేవ అనంతరం అమ్మవారిని వేంచేపుగా వాహన మండపానికి తీసుకొచ్చి కొలువుదీర్చారు. పాంచరాత్ర ఆగమ శాస్త్రోక్తంగా అర్చకులు పద్మావతీ దేవిని పరమపద నాథుడిగా అలంకరించి చిన్నశేష వాహనంపై కొలువుదీర్చారు.
పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా
మంగళవారం ఉదయం ధ్వజారోహణ కార్యక్రమాన్ని
నిర్వహిస్తున్న వేద పండితులు