రాష్ట్రీయం

వైభవంగా కార్తీక పౌర్ణమి గరుడ సేవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: తిరుమలలో మంగళవారం రాత్రి కార్తీక పౌర్ణమి గరుడ సేవ వైభవంగా జరిగింది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు తనకు ఎంతో ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈఓ ధర్మారెడ్డి, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాధ్, వీఎస్‌ఓ మనోహర్, ఇతర అధికారులు, విశేషంగా భక్తులు పాల్గొన్నారు.

*చిత్రం...తిరుమల మాడ వీధుల్లో గరుడ వాహనంపై విహరిస్తున్న శ్రీవారు