రాష్ట్రీయం
టిడిపిలో చేరిన కదిరి ఎమ్మెల్యే
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 24 April 2016
విజయవాడ, ఏప్రిల్ 23: అనంతపురం జిల్లా కదిరి వైకాపా ఎమ్మెల్యే అక్తర్ చాంద్ బాషా తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయన శనివారం తన అనుచరులతో కలసి విజయవాడలో సిఎం చంద్రబాబును కలిశారు. వారికి ముఖ్యమంత్రి పచ్చ కండువాలు కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో ఇప్పటివరకు తెలుగుదేశంలో చేరిన వైకాపా ఎమ్మెల్యేల సంఖ్య 13కి చేరింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ అంతర్గత విభేదాలు లేకుండా అందరూ కలసికట్టుగా జిల్లా అభివృద్ధికి పాటుబడాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే చాంద్ బాషా మాట్లాడుతూ తన నియోజకవర్గ అభివృద్ధి కోసమే తెలుగుదేశంలో చేరినట్లు చెప్పారు. చాంద్ బాషా గతంలో తెలుగుదేశంలో పనిచేశారు. గత ఎన్నికల సమయంలో వైకాపాలోకి వెళ్లి ఆ పార్టీ టిక్కెట్పై ఎమ్మెల్యేగా గెలిచారు.