తెలంగాణ

లాకప్ డెత్‌పై విచారణకు హైకోర్టు ఆదేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 29: రంగారెడ్డి జిల్లా మోమిన్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో జరిగిన లాకప్ డెత్‌పై జుడిషియల్ మెజిస్ట్రేట్‌చే విచారణ జరిపించాలని హైకోర్టు జస్టిస్ రామలింగేశ్వర రావు శుక్రవారం ఆదేశించారు. 2007లో మోమిన్‌పేట్ పోలీస్ స్టేషన్లో ఇబ్రహీం అనే వ్యక్తి లాకప్‌లో మృతి చెందాడు. ఈ మేరకు న్యాయ విచారణ జరిపించి బాధ్యులను శిక్షించాలని కోరుతూ ఇబ్రహీం భార్య నజ్మా కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు మూడు నెలల్లో కేసుపై పూర్తి విచారణ జరిపించాలని హైదరాబాద్ హైకోర్టు జస్టిస్ రామలింగేశ్వర రావు ఆదేశించారు.