రాష్ట్రీయం

ఎన్‌కౌంటర్ మృతుల్లో డిసిఎం ఆజాద్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొయ్యూరు, మే 5: విశాఖ మన్యం కొయ్యూరు మండలంలో బుధవారం సాయంత్రం జరిగిన ఎన్‌కౌంటర్ మృతుల్లో ఒకరిని గాలికొండ ఏరియా కమిటీ కమాండర్, జిల్లా కమిటి సభ్యుడు (డిసిఎం) ఆజాద్ అలియాస్ గోపాల్‌గా పోలీసులు గుర్తించారు. మరో మహిళా మావోయిస్టు, ఓ దళ సభ్యుడిని గుర్తించాల్సి ఉంది. ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మృతి చెందగా, మిగతా వారు తప్పించుకున్న విషయం తెలిసిందే. గురువారం మధ్యాహ్నం నర్సీపట్నం ఒఎస్‌డి అట్టాడ బాబూజీ, గ్రే హౌండ్స్ కమాండెంట్ వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు సంఘటన స్థలాన్ని సందర్శించారు. ఎన్‌కౌంటర్‌లో ఆజాద్ మృతి చెందడంతో మన్యంలో మావోయిస్టులకు గట్టిదెబ్బ తగిలినట్టయింది.