జాతీయ వార్తలు

మోదీ, షాలకు బాబు అభినందనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ , మే 19: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో విజయం సాధించిన నేతలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. అస్సాంలో అధికారాన్ని సాధించినందుకు, ఎన్నికలు జరిగిన ఇతర రాష్ట్రాల్లో ఓటింగ్ శాతాన్ని పెంచుకొని, మెరుగైన ఫలితాలను సాధించినందుకు ప్రధాని నరేంద్రమోదీని, బిజెపి అధ్యక్షుడు అమిత్‌షాను చంద్రబాబు అభినందించారు.
జయలలితతో మాట్లాడిన ఏపి సిఎం
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా రెండోసారి విజయం సాధించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలితకు ఫోన్ చేసి అభినందించారు. బాగా పని చేసిన ప్రభుత్వాలకు ప్రజలు పట్టంగడతారని ఈ ఎన్నికలు నిరూపించాయని తెలియజేశారు. తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీకి చంద్రబాబు అభినందనలు తెలియజేశారు.