రాష్ట్రీయం

ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 20: కనిపెంచిన తల్లిని ఆసుపత్రిలో చేర్పించి సపర్యలు చేస్తూ రోడ్డు ప్రమాదానికి గురై తండ్రి అకాల మరణం చెందటాన్ని తట్టుకోలేక ముగ్గురు తోబుట్టువులు కూడబలుక్కొని రాయనపాడులో రైలుపట్టాలపై పడుకొని ఆత్మహత్యకు పాల్పడగా వారిలో ఇద్దరు అక్కడికక్కడే మరణిస్తే మరొకరు కొన వూపిరితో ప్రైవేట్ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్న విషాదకర ఉదంతం ఇది. శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. ఆంధ్రభూమి ప్రతినిధి సేకరించిన సమాచారం ప్రకారం హైదరాబాద్ కూకట్‌పల్లికి చెందిన లారీ యజమాని షేక్ రఫీకి నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వీరిలో మరణించిన షాహినా సుల్తానా బిటెక్, పర్వీనా సుల్తానా ఎంసిఎ చదువుతోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాలుగో కుమార్తె రుక్సియా సుల్తానా బిటెక్ పూర్తి చేసింది. వీరి మరణాలతో బంధువులు శోక సముద్రంలో మునిగిపోయారు. ఇక రఫీ భార్య సుల్తానా అనారోగ్యానికి గురికావడంతో విజయవాడ సమీపంలోని పోరంకిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నాడు. భార్యకు అందుబాటులో ఉండేందుకు రాయనపాడులో ఒక గది అద్దెకు తీసుకున్నాడు. బుధవారం రాత్రి ఆసుపత్రి నుంచి తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో రఫీ అక్కడికక్కడే మరణించాడు. తండ్రి మరణంతో ముగ్గురు తోబుట్టువులు తీవ్ర ఆవేదనకు గురై తండ్రి లేకుండా తాము ఎందుకు జీవించాలనుకొని ఆత్మహత్య ప్రయత్నానికి ఒడిగట్టారు. ఇద్దరు అక్కా చెల్లెళ్ల మృతదేహాలను స్వాధీనపర్చుకున్న రైల్వే పోలీసులు ఈ కేసును భవానీపురం పోలీసులకు అప్పగించారు.
బందరులో కామపిశాచి!
ఐదేళ్ళ బాలికపై 60 ఏళ్ల వృద్ధుని అత్యాచారం
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, మే 20: అభం శుభం తెలియని ఐదేళ్ళ బాలికపై 60 ఏళ్ళ వృద్ధుడు కామంతో కళ్ళు మూసుకుపోయి అత్యాచారానికి పాల్పడిన సంఘటన జిల్లా కేంద్రం మచిలీపట్నంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సుమారు రెండు నెలల క్రితం జరిగిన ఈ ఘటనపై చిన్నారి తల్లిదండ్రులు శుక్రవారం పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల కథనం ప్రకారం స్థానిక చింతగుంటపాలెంకు చెందిన ఐదేళ్ళ బాలిక స్థానికంగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రంలో చదువుతోంది. మార్చి 31న అదే ప్రాంతానికి చెందిన పృధ్వి నాగేశ్వరరావు (60) బాలికను ఆడించేందుకు తన ఇంటికి తీసుకువెళ్ళాడు. గంట తర్వాత బాలిక తాత మనువరాలిని తీసుకు వచ్చేందుకు నాగేశ్వరరావు ఇంటికి వెళ్ళాడు. ఎంత సేపటికి నాగేశ్వరరావు తలుపు తీయకపోవటంతో అతనే తలుపు తీసుకుని ఇంట్లోకి వెళ్ళగా అప్పటికే నాగేశ్వరరావు బాలికపై అత్యాచారం జరిపాడు. అయితే ఎక్కడ కుటుంబ పరువు పోతుందోనన్న భయంతో ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులు దాచి పెట్టారు. అయితే అప్పటి నుండి బాలిక ఆరోగ్య పరిస్థితి బాగుండకపోవటంతో చిన్నపాటి ప్రైవేట్ వైద్యులను సంప్రదించారు. ఎంతకీ బాలిక ఆరోగ్యం కుదుట పడకపోవటంతో శుక్రవారం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఆస్పత్రి గైనకాలజిస్ట్ ఆ బాలికను పరీక్షించగా లైంగిక దాడి జరిగినట్టు తెలిపారు. దీంతో బాలిక తల్లిదండ్రులు ఇనగదురు పోలీసులను ఆశ్రయించారు. ఇనగదురు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సాయి ప్రసాద్, ఎస్‌ఐ రమేష్ బాలిక తల్లిదండ్రుల నుండి వివరాలు సేకరించారు. పోక్టో యాక్ట్ కింద నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రమేష్ తెలిపారు.