రాష్ట్రీయం

పొత్తూరికి జీవిత సాఫల్య పురస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 22: పత్రికా రంగంలో విశేష సేవలు అందించిన సీనియర్ జర్నలిస్టు పొత్తూరి వెంకటేశ్వర రావుకు విశాఖలోని గంటా నారాయణమ్మ స్మారక ట్రస్టు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందచేసింది. విశాఖలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి గంటా శ్రీనివాసరావు, మంత్రి కొల్లు రవీంద్ర ఈ అవార్డును ఆందచేశారు. ఈ సందర్భంగా పొత్తూరి వెంకటేశ్వర రావు మాట్లాడుతూ జర్నలిజంలో ఇటీవల కాలంలో పెడధోరణులు ఎక్కువ అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నీతి నిజాయితీ, సామర్థ్యం ఆధారంగా ఈ రంగంలో పని చేస్తున్న జర్నలిస్టులకు పురస్కారాలను అందచేయడంద్వారా ఈ రంగంలో నీతినిజాయితీలను ప్రోత్సహించినట్లు అవుతుందన్నారు. ప్రజల పక్షాన నిలిచే జర్నలిస్టులకు అవార్డులు ఇవ్వాలని సూచించారు. అవార్డుతోపాటు తనకు అందచేస్తున్న లక్ష రూపాయలను జిల్లెలమూడిలోని బాలికల వసతి గృహానికి విరాళంగా అందచేస్తున్నట్లు ప్రకటించారు.