రాష్ట్రీయం

1నుంచి లాయర్ల సర్ట్ఫికెట్ల తనిఖీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 28: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన న్యాయవాదులు సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు జూన్ 1వ తేదీ నుంచి 30వ తేదీ మధ్య లా, ఇతర విద్యార్హతలకు సంబంధించిన ధ్రువపత్రాలను బార్ కౌన్సిల్‌కు సమర్పించి తనిఖీ చేయించుకోవాలని ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ చైర్మన్ ఏ నరసింహారెడ్డి పేర్కొన్నారు. 2015 బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూపొందించిన మార్గదర్శకాల మేరకు ధ్రువపత్రాలను తనిఖీ చేయించుకోవాలని ఆయన కోరారు. ఈ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని బార్ కౌన్సిల్ ఆదేశించిందన్నారు. సాలీనా ఐదు వకాలత్‌లను ప్రతి న్యాయవాది ఫైల్ చేయాల్సి ఉంటుందని బార్ కౌన్సిల్ సభ్యుడు, ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు తెలిపారు. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి బార్ కౌన్సిల్ న్యాయవాదుల ధ్రువపత్రాలను పరిశీలించాల్సి ఉంటుందన్నారు.