ఆంధ్రప్రదేశ్
తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 14 June 2016
తిరుమల, జూన్ 13: తిరుమల నుంచి మొదటి ఘాట్రోడ్డులో తిరుపతికి వస్తున్న ఓ టెంపో 54వ మలుపువద్ద అదుపుతప్పి పిట్టగోడను ఢీకొన్న సంఘటన సోమవారం ఉదయం జరిగింది. ఈ సంఘటనలో అందులో ప్రయాణిస్తున్న 10 మంది భక్తులు స్వల్పంగా గాయపడ్డారు. శ్రీవారి దర్శనం చేసుకున్న కర్ణాటకకు చెందిన పది మంది సోమవారం ఉదయం తిరుగుప్రయాణమయ్యారు. 7 గంటల ప్రాంతంలో 54వ మలుపు వద్ద వారు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి పిట్టగోడ ను ఢీకొనడంతో 10 మంది స్వల్పగాయాలకు గురయ్యారు. వెంటనే సమాచారం తెలుసుకున్న ఘాట్రోడ్డు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను తిరుపతి రుయాకు తరలించారు. డ్రైవర్ వాహనాన్ని వేగంగా నడపడంతో ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.