తెలంగాణ

ఏడున్నావు కొడుకా.. ఓసారి రా...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వలిగొండ, జూన్ 16: కొడుకా.. ఏడున్నావురా.. కడచూపుకైనా రారా.. అంటూ మావోయిస్టు ఆంధ్ర-ఒరిస్సా బార్డర్ కార్యదర్శి శ్యామల కిష్టయ్య అలియాస్ దయ తల్లి శ్యామల చంద్రమ్మ కన్నీటి పర్యంతమయ్యారు. నల్లగొండ జిల్లా వలిగొండ మండలంలోని దాసిరెడ్డిగూడెంకు చెందిన శ్యామల కిష్టయ్య అలియాస్ దయ దాదాపు 24 ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. నాటి నక్సలైట్ ఉద్యమంలో చేరి నేటి వరకు తిరిగి రాకుండా మావోయిస్టు కార్యకలాపాల్లో కొనసాగుతున్నాడు. కాగా, బుధవారం దయ తల్లి చంద్రమ్మకు పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను జీవిత చరమాంకంలో ఉన్నానని, ఇలాంటి పరిస్థితుల్లో తనకు ఆసరాగా ఉండేందుకు తన వద్దకు రావాలని కొడుకు దయకు పిలుపునిచ్చింది. అనంతరం భువనగిరి డిఎస్పీ సాదు మోహన్‌రెడ్డి మాట్లాడుతూ శ్యామల కిష్టయ్య జనజీవన స్రవంతిలో కలిసేందుకు ప్రభుత్వం, పోలీస్‌శాఖ అన్ని విధాలుగా సహకరిస్తుందన్నారు. ప్రభుత్వం ద్వారా కిష్టయ్య పేరుమీద ఉన్న 25 లక్షల రివార్డును అందజేస్తామని, ఇతర సదుపాయాలను కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రామన్నపేట సిఐ శ్రీ్ధర్‌రెడ్డి, వలిగొండ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.