రాష్ట్రీయం

శ్రీవారి ట్రస్టుకు రూ. 2కోట్ల విరాళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, జూలై 16: టిటిడి నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వర నిత్యాన్నప్రసాదం ట్రస్టుకు శనివారం రెండు కోట్ల రూపాయలు విరాళంగా అందింది. చెన్నైకి చెందిన టివిఎస్ మోటార్స్ సంస్థ అధ్యక్షుడు, సిఇఓ రాధాకృష్ణన్ ఒక కోటి రూపాయలు, చెన్నైకి చెందిన సుందరం క్లేటన్ లిమిటెడ్ సంస్థ సిఇఓ రంగనాథన్ ఒక కోటి రూపాయలు అందించారు. ఈమేరకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టిటిడి ఇఓ డాక్టర్ డి.సాంబశివరావుకు విరాళాల డిడిలను దాతలు అందజేశారు. ఈ సందర్భంగా దాతలకు శ్రీవారి తీర్థప్రసాదాలను ఇఓ అందజేశారు.

చిత్రం.. శ్రీవారి ఆలయంలో టిటిడి ఇఓకు విరాళం చెక్కును అందజేస్తున్న భక్తులు