రాష్ట్రీయం

250 బ్యాంకు ఖాతాలు.. వెయ్యి ఎకరాల భూమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 17: గ్యాంగ్‌స్టర్ నరుూం అక్రమ వ్యవహారాలపై సిట్ దర్యాప్తులో రోజుకో ఆసక్తికరమైన, దిగ్భ్రాంతికరమైన అంశాలు వెల్లడవుతున్నాయి. నరుూం నేరచరిత్రతో తమకు సంబంధం లేదని, ఈ నేరగాడితో తమకు పరిచయం లేదంటూ ఇప్పటికే మాజీ మంత్రి ఉమామాధవరెడ్డి, రిటైర్డు డిజిపి దినేష్‌రెడ్డితో పాటుగా తాజాగా మాజీ ఐపిఎస్ అధికారి శివకుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ప్రకటించారు. తాజాగా నరుూం దందాలో కొత్తకోణం వెలుగుచూసింది. నరుూం అన్న టాక్స్ (ఎన్‌ఏటి) పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడినట్టు సిట్ అధికారులు గుర్తించారు. నరుూం ఆస్తులకు సంబంధించి పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు తాజాగా నరుూంతో కొందరు పెద్దలు మాట్లాడినట్టుగా వీడియో రికార్డులను సిట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారం రోజులుగా నరుూం బంధువులు, అనుచరుల ఇళ్లలో జరుపుతున్న సోదాల్లో స్వాధీనం చేసుకున్న వీడియో, సిడిలను సిట్ అధికారులు స్కూృటినీ చేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన ఒక ప్రజాప్రతినిధికి నరుూంతో సంబంధాలున్నట్లు సిట్ పోలీసులకు ఆధారాలు లభించాయన్న సమాచారం రాజకీయ వర్గాల్లో సంచలనం కలిగిస్తోంది. నరుూం బంధువుల పేరిట దాదాపు 250 వివిధ బ్యాంకులకు చెందిన అకౌంట్లను పోలీసులు గుర్తించారు. నరుూంకు చెందిన నాలుగు ఇళ్లల్లో 800 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. సిట్ దర్యాప్తులో విస్తుగొలిపే విషయాలు వెలుగుచూస్తున్నాయి. నరుూం పేరుతో ఎలాంటి బ్యాంక్ అకౌంట్ లేకుండానే వేలకోట్ల రూపాయల లావాదేవీలు నడిపినట్టు సిట్ అధికారులు గుర్తించారు. బంగారు ఆభరణాలు, నగదుతోపాటు తెలంగాణ, ఇతర రాష్ట్రాల్లోని నరుూం అస్తుల విలువ వేల కోట్ల రూపాయలు ఉండొచ్చని సిట్ అంచనా వేస్తోంది. బినామీల పేరిట ఇప్పటి వరకు 1015 ఎకరాల భూమి, లక్షా 67 వేల 117 చదరపు గజాల ప్లాట్లు ఉన్నట్టు సిట్ గుర్తించింది. ప్రస్తుత రిజిస్ట్రేషన్ చేయించుకున్న తేదీల నాటి విలువ ప్రకారం వీటి విలువ 14.39 కోట్లు కాగా బహిరంగ మార్కెట్ విలువ రూ. 1500 కోట్లకు పైగా ఉంటుందని సిట్ భావిస్తోంది.
సిమ్ కార్డులపై దర్యాప్తు ముమ్మరం
నరుూంకు చెందిన నాలుగు ఇళ్ల సోదాల్లో దొరికిన సుమారు 8వందల సిమ్ కార్డులపై సిట్ అధికారుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. సిమ్ వివరాల కోసం టెలికాం కంపెనీలను సంప్రదించారు. ఇన్నాళ్లు భూముల డాక్యుమెంట్లు, ఫ్లాట్లు, ఇళ్ళపై దృష్టి సారించిన సిట్ ఇప్పుడు సాంకేతిక సాక్ష్యాలు సేకరించే పనిలో పడ్డారు. ఆయా నెట్‌వర్క్‌ల సిమ్ కార్డులతో ప్రత్యేక పోలీసు బృందం సిమ్ కంపెనీలకు వెళ్లింది. సిమ్ కార్డులన్నీ ఎవరి పేరిట ఇచ్చారు..చిరునామాలేంటి..ఎవరి ద్వారా చేరాయి అన్న వివరాలతోపాటు కాల్ డేటా జాబితాను సేకరిస్తున్నారు. ఇందులో అధిక సిమ్‌కార్డులు హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు చెందినవిగా ఆధార్ కార్డు నెంబర్ల ద్వారా గుర్తించినట్టు తెలిసింది.
నరుూం అన్న టాక్స్ (ఎన్‌ఏటి) పేరుతో నరుూం అనుచరులు నాలుగు జిల్లాల్లో అక్రమ వసూళ్లకు పాల్పడినట్టు సిట్ గుర్తించింది. నల్గొండ, మహబూబ్‌నగర్, హైదరాబాద్‌లోని దాదాపు 160 మంది బడా వ్యాపారుల నుంచి టాక్స్ వసూలు చేసినట్టు తెలుస్తోందని సిట్ గుర్తించినట్టు తెలిసింది.
పెట్రోల్ బంక్ ఉద్యోగులనూ వదలని వైనం
హైదరాబాద్‌లో పనిచేస్తున్న హిందుస్తాన్ పెట్రోలియం ఉద్యోగులు కూడా నరుూం బాధితులయ్యారు. దాదాపు 60 మంది ఉద్యోగులు సికిందరాబాద్ బోయిన్‌పల్లిలో పదేళ్ల క్రితం ప్లాట్లు కొన్నారు. తమతమ పేర్లతో రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు. కాగా ఓ రోజు నరుూం ముఖ్య అనుచరుల్లో ఒకడైన పాశం శ్రీనివాస్ వారిని బెదిరించి ఈ స్థలం భాయ్ సాబ్‌దని, మీ ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇచ్చేయాలంటూ బెదిరించాడు. దీంతో ప్రాణ భయంతో చేసేదేమిలేక నరుూం ముఠా ఆగడాలను ఎదురించలేకపోయామని బాధితులు పేర్కొన్నారు.
డిజిపిని కలసిన ఎమ్మెల్సీ
నరుూంతో సంబంధాలున్నట్టు వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ బుధవారం డిజిపి అనురాగ్ శర్మను కలిశారు. తనకు నరుూం వ్యవహారాలతో ఎలాంటి సంబంధం లేదని డిజిపికి వివరించినట్టు తెలిసింది.
ఫర్హానా, అఫ్షాలకు 12రోజుల కస్టడీ
నరుూం ముఖ్య అనుచరులు ఫర్హానా, అఫ్షాలకు 12 రోజులు పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది.