రాష్ట్రీయం

చివరి అంకంలో ఉద్యోగుల విభజన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 27: తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఉద్యోగుల కేటాయింపులపై కమలనాథన్ కమిటీ నేతృత్వంలో సోమవారం ఉన్నతస్థాయి సమావేశం జరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ఎపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్‌తో పాటు ఇరు రాష్ట్రాలకు చెందిన సంబంధిత ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. రాష్ట్ర సచివాలయానికి సంబంధించి సెక్షన్ ఆఫీసర్లు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ల పోస్టులతో పాటు వైద్య ఆరోగ్య రంగానికి చెందిన ఉద్యోగుల కేటాయింపుల అంశాలను చర్చిస్తారని సంబంధిత ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. శనివారం ఆయన ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ ఇప్పటికే అన్ని శాఖలకు చెందిన ఉద్యోగుల విభజన జరిగిపోయిందని, సమస్యాత్మక అంశాలుగా మిగిలిపోయిన కొన్ని శాఖలపైనే సోమవారం జరిగే సమావేశంలో చర్చిస్తామని తెలిపారు. ఉద్యోగుల విభజనకు సంబంధించి బహూశా ఇదే చివరి సమావేశం కావచ్చని అభిప్రాయపడ్డారు. భవిష్యత్ పరిస్థితిపై కూడా కూలంకషంగా చర్చిస్తామని స్పష్టం చేశారు.