రాష్ట్రీయం

బాబూ.. మీరు చాలా స్పీడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 27: ‘పనిలో మీ వేగం మా వేగానికి సరిపోయింది. ఇంత వేగంగా స్పందించి, పనిచేసే మీలాంటి నాయకుణ్ణి ఎక్కడా చూడలేదు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం’ అని రిపబ్లిక్ ఆఫ్ కొరియా కాన్సులేట్ జనరల్ క్యుంగ్సూ కిమ్ ప్రశంసించారు. గురువారం ఆయన దక్షిణ కొరియా పారిశ్రామికవేత్తలతో కలిసి ముఖ్యమంత్రి కార్యాలయంలో చంద్రబాబుతో సమావేశమయ్యారు. తమ దేశపు వృద్ధి రేటు 2 శాతం మాత్రమే ఉందని, రాష్ట్ర విభజన తరువాత సవాళ్లను ఎదుర్కొంటూ కూడా ఆంధ్రప్రదేశ్ 10.99 వృద్ధి రేటు సాధించడం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలో రెండో స్థానంలో ఉండటం అపూర్వమన్నారు. ‘పనిలో మీ వేగానికి, మా వేగానికి లంకె కుదురుతుంది. చంద్రబాబు ఈజ్ ఎ చార్మింగ్ సిఎం’ అంటూ కిమ్ ప్రశంసల జల్లు కురిపించారు. కాగా రాష్ట్రంలో మాన్యుఫాక్చరింగ్ యూనిట్లు నెలకొల్పాలని కొరియా పారిశ్రామికవేత్తలను చంద్రబాబు కోరారు. రాష్ట్రంలో ఏ ఇంట్లో చూసినా, కొరియాలో తయారైన ఎలక్ట్రానిక్ వస్తువులే దర్శనమిస్తాయని, కొరియాతో రాష్ట్రానికి ఎంతో అనుబంధం ఉందని గుర్తు చేశారు. రాజధాని అమరావతిలో కాన్సులేట్ జనరల్ కార్యాలయాన్ని స్థాపించాలని కోరారు. ఎపి లో ఉత్పాదక యూనిట్లను స్థాపించాలన్న ఆసక్తి తమకు ఉందన్నారు. త్వరలో తమ దేశ ప్రతినిధులు వచ్చి అవకాశాలను పరిశీలిస్తారని, తదుపరి త్వరలో నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. కిమ్‌ను దక్షిణ కొరియా సంప్రదాయ జ్ఞాపికతో సత్కరించారు. సమావేశంలో దేవు ఆటోమోటివ్ సీట్ ఇండియా ఎండి ఛో ఇన్ హో, హ్యోంకూక్ ఎలివేటర్స్ మెటీరియల్స్ ఎండి సాంగ్ వూ ఎలెక్స్‌కిమ్, కెఇబి హనా బ్యాంక్ సిఇఒ లీ యాంగ్ హ్యో, ఎపి ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు సిఇఒ జాస్తి కృష్ణకిషోర్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. దక్షిణ కొరియా పారిశ్రామికవేత్తతో మాట్లాడుతున్న చంద్రబాబు