తెలంగాణ

సోనియాను ఎందుకు కలిశారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 8: టిజెఏసి చైర్మన్ కోదండరాం కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ అని, ఆయన సోనియాగాంధీని ఎందుకు కలిశారో చెప్పాలని టిఆర్‌ఎస్ ఎంపి బాల్కసుమన్ ప్రశ్నించారు. టిఆర్‌ఎస్ శాసన సభాపక్షం కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఎంపి మాట్లాడుతూ 2016 జూలై 16, 27 తేదీల్లో కోదండరాం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాని కలిశారని చెప్పారు. ప్రొఫెసర్ పురుషోత్తమ్ రెడ్డి, సుశీ ఇన్‌ఫాస్ట్రక్చర్ చెందిన అమరేందర్‌రెడ్డిలతో పాటు కోదండరాం సోనియాని కలిశారన్నారు. కోదండరాం కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ అని మొదటి నుంచి తాము చెబుతూనే ఉన్నామని, అది రుజువు అయిందని అన్నారు. కోదండరాం సోనియాను కలిసిన తరువాతి నుంచే మల్లన్నసాగర్ ఆందోళనలో పాల్గొన్నారని, ప్రతి వేదికపైనా ప్రభుత్వాన్ని విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ శిఖండి రాజకీయాలు మానుకోవాలని చెప్పారు. జెఎసి మేధావి ముసుగులో కోదండరాం కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకు రావాలని ప్రయత్నిస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏజెంట్‌గా పని చేసే బదులు కోదండరామ్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటే మంచిదని అన్నారు.