తెలంగాణ

ఓటర్ల తొలగింపుపై 7న నివేదిక ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 5: గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ పరిధిలో ఓటర్ల జాబితాలో నుంచి 7.9 లక్షల ఓటర్లను తొలగించినట్లు వచ్చిన అభియోగాలపై ఈ నెల 7వ తేదీన నివేదిక ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి భోంస్లే, జస్టిస్ ఎస్‌వి భట్‌తో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలను వెలువరించింది. జిహెచ్‌ఎంసి పరిధిలో 7.9 లక్షల ఓటర్లను తొలగించారని అభియోగం చేస్తూ నగరానికి చెందిన మహేష్ గౌడ్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. నిజాల ప్రాతిపదికన పిటిషనర్ తన వాదనలు కోర్టుకు విన్నవించాలని, అంచనాలు, అభిప్రాయాలు ప్రాతిపదికన కాదని హైకోర్టు పిటిషనర్‌కు సూచించింది. ఓటర్ల జాబితాలో తొలగించిన ఓటర్ల వివరాలు, తీసుకున్న నిర్ణయాలపై ఎన్నికల సంఘం అభిప్రాయాలతో కూడిన నివేదికను గురువారం సమర్పించాలని హైకోర్టు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.