రాష్ట్రీయం

నియోజకవర్గాల పెంపు అవకాశాలను పరిశీలించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,జనవరి 24: తెలుగు రాష్ట్రాలలో నియోజక వర్గాల పునర్విభజనకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని కేంద్ర హోంశాఖమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజ్ఞప్తి చేశారు. మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు హోం మంత్రి రాజ్‌నాథ్‌ను కలిశారు. రెండు తెలుగు రాష్ట్రాలలో నియోజక వర్గాల పెంపునకు సంబంధించిన అంశం స్పష్టంగా లేకపోవడంతో ఇప్పటికే పలుపురు ఎంపీలు పార్లమెంట్ అడిగిన ప్రశ్నలకు హోంశాఖ సమాధానం ఇస్తూ 2026వరకు రెండు తెలుగు రాష్ట్రాలలో నియోజక వర్గాలు పెంచే అవకాశం లేదని చెప్పడం తెలిసిందే. అయితే చంద్రబాబు ఈ అంశాన్ని రాజ్‌నాథ్ దృష్టికి తీసుకొచ్చి, నియోజక వర్గాల పెంపునకు సహకరించాలని కోరారు. వాటితో పాటుగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు కేంద్రమంత్రితో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు. చంద్రబాబు బిజెపి అధ్యక్షుడు అమిత్‌షాను కూడా కలిశారు.