రాష్ట్రీయం

ప్రతి ఒక్కరూ ప్రతినబూనాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఫిబ్రవరి 20: హైందవ సనాతన ధర్మం వేదాల నుంచి వచ్చిందని, ఇలాంటి ధర్మాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ ప్రతినబూనాలని 4వ సనాతన ధార్మిక సదస్సులో మఠాధిపతులు, పీఠాధిపతులు ఆకాంక్షించారు. రాష్ట్ర దేవాదాయశాఖకు చెందిన హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్టు ఆధ్వర్యంలో టిటిడి సహకారంతో తిరుమలలోని ఆస్థాన మండంలో సోమవారం ఉదయం సనాతన ధార్మిక సదస్సు ఘనంగా ప్రారంభమైంది. దేశ వ్యాప్తంగా 63మంది మఠ,పీఠాధిపతులు ఈ సమావేశానికి విచ్చేశారు. ఈసందర్భంగా వారు తమతమ ప్రాంతాల్లో హిందూ ధర్మ పరిరక్షణకు, ప్రజా చైతన్యానికి, సామాజిక సేవలపై చేపడుతున్న కార్యక్రమాలను సవివరంగా తెలియజేశారు. ముందుగా శ్రీవారి ఆలయ తిరుమల జీయర్ స్వామి గోవిందరామానుజ చిన్నజీయర్ స్వామి మంగళాశాసనాలతో సదస్సు ప్రారంభమైంది. వేదాలు భారతీయ జీవనశైలికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని, ప్రశాంతమైన, నీతివంతమైన జీవనం సాగించేందుకు దోహదపడుతుందని స్వామీజీ అభిప్రాయపడ్డారు. ఇలాంటి వేదాలను, సనాతన ధర్మాన్ని భావితరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
హిందూ ధర్మంపై జరుగుతున్న దాడిని అడ్డుకోవాలి:పివిఆర్ ప్రసాద్
అతి పవిత్రమైన హైందవ సనాతన ధర్మాలపై అన్యమతస్థులు చేస్తున్న దుష్ప్రచార దాడిని అడ్డుకోవడానికి యావత్ హైందవ సమాజం సంఘటితమై కార్యోన్ముఖులు కావాల్సిన అవసరం ఉందని హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్టు అధ్యక్షులు పివిఆర్ ప్రసాద్ పిలుపునిచ్చారు. మారుమూల గ్రామాల్లో ధర్మప్రచార కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా క్షేత్రస్థాయిలో సనాతన ధర్మ ప్రచారం విస్తృతం చేయాలన్నారు. ఇందుకోసం మఠాధిపతులు, పీఠాధిపతులు ఏకతాటిపైకి వచ్చి కార్యక్రమాలకు రూపకల్పన చేయాలని అభ్యర్ధించారు. గ్రామ స్థాయిలో ఉత్సాహ వంతులైనవారికి 400మందికి శిక్షణ ఇచ్చి హిందూ ధర్మ ప్రచారకులుగా తీర్చిదిద్దినట్లు వివరించారు. హైందవ సనాతన ధర్మ గొప్పతనంపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు వీరు కృషి చేస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారని అన్నారు. హిందూ ధర్మప్రచారకులు గ్రామాల్లో పర్యటించి మత మార్పిడులు జరగకుండా అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు. గ్రామాల్లో ప్రజలకు విద్య, ధార్మిక అంశాలు, భజనలపై శిక్షణ ఇస్తున్నామని, తద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయని వివరించారు.
ధర్మప్రచార కార్యక్రమాలు మరింత విస్తృతం: చదలవాడ
టిటిడి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి మాట్లాడుతూ సనాతన ధర్మప్రచారానికి టిటిడి రాజీలేని విధానాలతో విస్తృతంగా ధర్మప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోందని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి ఉద్ఘాటించారు. తిరుమల దివ్యక్షేత్రానికి విచ్చేసే భక్తులకే కాకుండా, ఈ క్షేత్రానికి రాలేకపోతున్న మారుమూల ప్రాంతాల్లోని వారికి కూడా స్వామివారి దర్శనం కల్పించేందుకు టిటిడి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోందన్నారు. ఇందులో భాగంగా అన్నిప్రాంతాల్లో సంచరించడానికి వీలుగా సంచార రథాలు, వివిధ ప్రాంతాల్లో కల్యాణోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. విదేశాల్లో ఉన్న హైంధవుల కోరికమేరకు అనేక దేశాల్లో శ్రీవారి కల్యాణోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇటీవల తిరుమల శ్రీవారి ఆలయం వద్ద ప్రతి శుక్రవారం ప్రారంభించిన గోపూజకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు.టిటిడి ఇఓ సాంబశివరావు మాట్లాడుతూ ధర్మప్రచారానికి ఆలయాలే కేంద్ర బిందువులని, దీనిని గుర్తించి మనగుడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు దర్శనం, బస, అన్నప్రసాదం తదితర వసతులతోపాటు ధర్మప్రచారం, ఉచిత విద్య, వైద్యం, గోసంరక్షణ, వేదపరిరక్షణ, ఆలయాల నిర్మాణం ప్రాధామ్యాలుగా ముందుకు వెడుతున్నామని ఇ ఒ వివరించారు. వేదాల పరిరక్షణకోసం వేద విశ్వవిద్యాలయాన్ని, 7 వేద పాఠశాలలను నిర్వహిస్తున్నామన్నారు. 1280 మంది వేదపారాయణదారులు, 280 మంది దివ్యప్రబంధ పారాయణదారులు ప్రతి జిల్లాలోను ముఖ్యమైన ఆలయాల్లో పారాయణం చేస్తున్నట్లు తెలిపారు. టిటిడి ప్రాజెక్టులు భజనలు, రథయాత్రలు, మెట్లోత్సవాల ద్వారా ధర్మప్రచారం చేస్తున్నాయని, ఆధ్యాత్మిక ప్రచురణలు, సప్తగిరి మాసపత్రిక, శ్రీ వేంకటేశ్వరభక్తి చానల్ కూడా ఇందుకు దోహదం చేస్తున్నాయని అన్నారు. ఆధ్యాత్మిక చానళ్లలో ఎస్వీబిసి మొదటి స్థానంలో ఉందని, ఇటీవల తమిళ చానల్ కూడా ప్రారంభించామన్నారు. సదస్సుకు విచ్చేసిన మఠాధిపతులు, పీఠాధిపతులు ఫలప్రదమైన చర్చలు జరిపి ఆచరణీయమైన సూచనలు ఇవ్వాలని ఇ ఓ సాంబశివరావు కోరారు.
వెనుకబడిన ప్రాంతాల భక్తులకోసం ‘దివ్యదర్శనం’
సదస్సులో రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి జిఎస్‌వి ప్రసాద్ మాట్లాడుతూ వెనుకబడిన ప్రాంతాల్లో భక్తుల కోసం ఈ ఏడాది జనవరి 2న దివ్యదర్శనం పేరుతో ప్రత్యేక దర్శన కార్యక్రమాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ రూపొందించిందని వెల్లడించారు. ఈ ఏడాదిలోగా 1.30 లక్షల మందికి ముఖ్య ఆలయాల్లో స్వామి దర్శనం కల్పించాలన్నది తమ లక్ష్యమన్నారు. కాశీ, ప్రయాగ, కేదార్‌నాథ్, బద్రీనాధ్ వంటి పవిత్రపుణ్య క్షేత్రాల్లో కూడా వీరికి దర్శనభాగ్యం కల్పించాలన్నదే తమ ఉద్దేశమన్నారు. అనంతరం దేవాదాయశాఖ కమిషనర్ వైవి అనురాధ కూడా హిందూ ధర్మ పరిరక్షణపై ఉపన్యసించారు. అనంతరం పుస్తకావిష్కరణ సమరసత సేవా ఫౌండేషన్ వారు 2015 డిసెంబర్ 2న తిరుమలలో టిటిడి, రాష్ట్ర దేవాదాయశాఖ, హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్టు ఏర్పాటు చేసిన ధార్మిక సదస్సులో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన నివేదికను పుస్తక రూపంలో ఆవిష్కరించారు.