ఆంధ్రప్రదేశ్‌

ఆకృతులు, భవంతులు అత్యుత్తమంగా ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 1: అమరావతి నగరంలో నిర్మించబోయే ప్రభుత్వ భవనాలు అత్యున్నతంగా (ఐకానిక్), వాటి ఆకృతులు విలక్షణంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. కొత్త రాజధానిలోని ప్రతి కట్టడానికి ఏకరూపత ఉండి తీరాలని బుధవారం సాయంత్రం తన కార్యాలయంలో నార్మన్ పోస్టర్‌తో జరిపిన ప్రత్యేక సమావేశంలో స్పష్టం చేశారు. రాజధానిలోని ప్రభుత్వ భవంతుల సముదాయ నిర్మాణానికి నార్మన్ పోస్టర్ సంస్థ నాలుగు రకాల ఆకృతులను రూపొందించి వాటిని ప్రభుత్వానికి అందించింది. ఇది కానె్సప్ట్ స్థాయి ఆకృతులని, వీటిపై అందరి అభిప్రాయాలను తీసుకుని సవివర కార్య ప్రణాళిక రూపొందిస్తామని, ఆ తరువాత నిర్మాణ ప్రణాళికను అందిస్తామని నార్మన్ పోస్టర్ తెలిపారు. మొత్తం ప్రభుత్వ భవనాల సముదాయంలో శాసనసభ, ఉన్నత న్యాయస్థానం భవంతులు కచ్చితంగా అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని, మిగిలిన అన్ని భవంతుల ఆకృతులు విలక్షణంగా ఉండాలని ఆయన వారికి సూచించారు. రాజధాని కట్టడాల ఆకృతుల రూపకల్పనలో జాతీయ, అంతర్జాతీయ నిపుణులతో పాటు స్థానికంగా ఉండే గొప్ప అనుభవశీలురైన ఆర్కిటెక్టుల సహాయ సహకారాలు తీసుకోవాలన్నదే తన ఆలోచన అని తెలిపారు. ప్రపంచ ప్రసిద్ధి పొందిన ఆస్థానా నగరాన్ని 150 మంది ఆర్కిటెక్టులు రూపొందించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఏదో ఒక స్థాయి నగరంగా రాజధాని ఉండాలని అనుకోవడం లేదని, ప్రపంచంలోని అత్యుత్తమ ఐదు నగరాల్లో ఒకటిగా ఉండేలా అంతర్జాతీయ నగరాన్ని నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. రాజధానిలోని ప్రతి నిర్మాణం, కట్టడంలో తెలుగువారి సంస్కృతి, సంప్రదాయం, చరిత్ర, వారసత్వ సంపద ప్రతిబింబించాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు రాజధానిలోని ప్రవేశించగానే అది తమ సొంతమనే భావన వ్యక్తమయ్యేలా నిర్మాణంలో అందరి ప్రాతినిధ్యం ఉంటుందన్నారు. దేశంలో గొప్ప రాజధానులుగా ఉన్న గాంధీనగర్, నయారాయపూర్, చండీఘర్ నగరాల్లో ఒక్కొక్క చోటా ఒక్కొక్క లోపం కనిపిస్తుందని, అమరావతి అలా కాకుండా బ్లూ, గ్రీన్ ఫీల్డ్ సిటీగా, ఆర్థిక కార్యకలాపాలకు వేదికగా, ప్రజా రాజధానిగా బాసిల్లాలన్నదే తన తాపత్రయమని చెప్పారు. మన సంస్కృతి, చరిత్ర, వారసత్వ సంపదలను నిలుపుకునే ప్రపంచ శ్రేణి నగరంగా, ఎకనామిక్ సిటీగా, పీపుల్ క్యాపిటల్‌గా అమరావతి నిర్మాణం జరుగుతుందని అన్నారు. దీనిపై రాష్ట్రంలోని ప్రజలందరి అభిప్రాయాలను తీసుకోవాలని అనుకుంటున్నామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వున్న తెలుగువారి సూచనలు, సలహాలు తీసుకునేందుకు త్వరలో ఒక ప్రత్యేక వెబ్ పోర్టర్ రూపొందించాలని ముఖ్యమంత్రి రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాథికార సంస్థ (సిఆర్‌డిఏ) కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్‌ను ఆదేశించారు. అలాగే ఫేస్‌బుక్ పేజీ, టిట్టర్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ అకౌంట్లను ప్రారంభించాలని చెప్పారు. నార్మన్ పోస్టర్ ఆకృతులను చూపించి అందరి అభిప్రాయాలను తెలుసుకునేందుకు, సూచనలు, సలహాలను పొందేందుకు గురువారం ఉదయం రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ కార్యదర్శులు, అన్ని శాఖల అధిపతులతో ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజయ్‌కల్లంకు సూచించారు. అభివృద్ధి ప్రవాహంలో కొట్టుకుపోకుండా రాజధాని పరిధిలోని 29 గ్రామాల అస్తిత్వాన్ని ఏదో ఒక రూపంలో నిక్షిప్తం చేసుకోవాలని, దాని కోసం ప్రభుత్వం ఒక నిర్దిష్ట కార్య ప్రణాళికను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం వున్నదని సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్ ముఖ్యమంత్రిని కోరారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి రాజధాని పరిధిలోని కొన్ని గ్రామాలను యథాతథంగా ఉంచుతామని ప్రకటించారు. రాజధాని నిర్మాణం పూర్తయినా కూడా ఇవి అలా గ్రామాలుగానే ఉంటాయని, వాటి ఆనవాళ్లు దెబ్బతినకుండా కాపాడుకుందామని అన్నారు. జెంగ్డూ, చండీఘర్ నగరాల్లో కొన్ని పాత గ్రామాలను యథాతథంగా ఉంచి వారికి పర్యాటక ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. రాజధాని పరిధిలోని 29 గ్రామాల ఉనికి కోల్పోకుండా కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకుందామని చెప్పారు. నార్మన్ పోస్టర్ అందించిన కానె్సస్ట్ స్థాయి ఆకృతులలో శాసనసభ, ఉన్నత న్యాయస్థానం, రాజ్‌భవన్, సచివాలయం భవంతులకు ఏ విధంగా రూప కల్పన జరపాలో పురపాలక మంత్రి పి నారాయణ ముఖ్యమంత్రికి సవివరంగా తెలిపారు. అంతకు ముందు ముఖ్యమంత్రి తన కార్యాలయంలో నార్మన్ ప్రతినిధులు ఏర్పాటు చేసిన కానె్సప్షనల్ ప్లాన్స్ నమూనా ఆకృతులను తిలకించారు. 900 ఎకరాల్లో ప్రభుత్వ భవంతుల సముదాయ నిర్మాణానికి సంబంధించి నార్మన్ పోస్టర్ రూపొందించి ఇచ్చిన నాలుగు నమూనా ఆకృతులను నిశితంగా పరిశీలించారు. పుత్రజయ, ఆస్థానా, వాష్టింగ్టన్ డిసి, లండన్, బ్రెసీలియా, న్యూఢిల్లీ తదితర నగరాలను పరిశీలించి వాటిల్లో ఉత్తమమైన అంశాలను తీసుకుని ఈ ఆకృతులను ప్రాథమికంగా రూపొందించామని నార్మన్ పోస్టర్ తెలిపారు. రచ్చబండలు, గ్రామాల్లోని పురాతన ఆలయాలు, ఉండవల్లి తదితర చారిత్రక ఆనవాళ్లు, ఇంకా, ఆంధ్రప్రదేశ్‌లో స్థానికంగా ఉండే కొన్ని అంశాలను పరిశీలనకు తీసుకున్నామని చెప్పారు. తరువాత జరిగిన రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాథికార సంస్థ సమావేశంలో కొండవీటివాగు ప్రణాళికలపై ముఖ్యమంత్రి జలవనరుల శాఖ అధికారులతో చర్చించారు. సమావేశంలో మంత్రి నారాయణ, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజేయ్‌కల్లాం, జలవనరుల ముఖ్య కార్యదర్శి శశిభూషణ్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి సాయి ప్రసాద్, సిఆర్‌డిఏ కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్ తదితరులు పాల్గొన్నారు.