రాష్ట్రీయం

వైభవంగా యోగానంద నారసింహుని తెప్పోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మపురి, మార్చి 12: సుప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన ధర్మపురిలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభించి బ్రహ్మపుష్కరిణిలో రాత్రి 9 గంటల వరకు నిర్వహించిన శ్రీయోగానంద నరసింహుని తెప్పోత్సవ, డోలోత్సవ కార్యక్రమాలు వైభవోపేతంగా జరిగాయి. దేవస్థానం ఎసి, ఇఓ సుప్రియ పర్యవేక్షణలో, దేవస్థాన యాజ్ఞికులు కందాళై పురుషోత్తమాచార్య, ఆస్థాన వేద పండితులు బొజ్జా రమేశ్ శర్మ, ప్రధానార్చకులు నంబి రఘునాథాచార్య, శ్రీనివాసాచార్యల ఆధ్వర్యంలో ఆదివారం లక్ష్మీనారసింహునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, సాయంత్రం 4.30 గంటలకు శ్రీయోగానంద నారసింహ ప్రధానాలయం నుండి వేదమంత్రాలతో, మంగళవాయద్యాలతో భక్తజనం తోడురాగా, నారసింహుని ఉత్సవమూర్తులను బ్రహ్మపుష్కరిణి వద్దకు ఊరేగింపుగా కొని తెచ్చారు.