రాష్ట్రీయం
108 సిబ్బందికి ఉగాది కానుక
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 29 March 2017
హైదరాబాద్, మార్చి 28: అత్యవసర వైద్య సేవలు అందిస్తున్న 108 సిబ్బందికి ఉగాది కానుకగా ప్రభుత్వం వేతనాలు పెంచుతున్నట్టు ప్రకటించింది. ఒక్కో ఉద్యోగికి రూ.4 వేల చొప్పున పెంచడమే కాకుండా, 2016 ఏప్రిల్ నుంచి అమలుల్లోకి వస్తాయని వైద్య ఆరోగ్య మంత్రి సి లక్ష్మారెడ్డి వెల్లడించారు. ఉగాది కానుకగా సిఎం కెసిఆర్ తీసుకున్న నిర్ణయం వల్ల 1578మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందని మంత్రి వివరించారు. అత్యవసర వైద్య సేవలు అందిస్తున్న 108 సిబ్బందికి ఉగాది కానుకగా ముఖ్యమంత్రి ప్రకటించిన కానుకవల్ల ప్రతి ఉద్యోగి కుటుంబంలో ఆనందోత్సహాలు వెల్లివిరుస్తున్నాయని మంత్రి అన్నారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్కు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.