రాష్ట్రీయం

ఎనిమిదేళ్ల శిక్షకు లక్ష పరిహారమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 1: చేయని నేరానికి ఎనిమిదేళ్ల పాటు ఆయేషా మీరా హత్య కేసులో నిందితుడిగా శిక్ష అనుభవించిన సత్యంబాబుకు లక్ష రూపాయల పరిహారం ఏమాత్రం సరిపోదని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. శనివారం ఇక్కడ ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ అప్పటి ఎపి ప్రభుత్వం న్యాయవ్యవస్థను, పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. జైల్లో 8 ఏళ్లపాటు చేయని నేరానికి శిక్ష అనుభవించిన సత్యంబాబు ఎంతో విలువైన జీవితాన్ని పాడుచేసుకున్నాడని అన్నారు. పెద్ద నోట్లను రద్దు చేసినా దేశంలో నల్లధనం మొత్తం బయటకు రాలేదని అన్నారు. కొత్తగా చేస్తున్న చట్టాలను ఉపసంహరించుకోవాలని ఆయన ప్రధాని మోదీని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలకు విలువనివ్వకుండా, పక్షపాత వైఖరితో తెలంగాణ అసెంబ్లీలో అధికార పక్షం వ్యవహరిస్తూ ప్రజాస్వామిక విలువలకు తిలోదకాలిస్తోందని అన్నారు.