రాష్ట్రీయం

‘మిర్చి’ సమస్య పరిష్కరిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 10: రాష్ట్రంలోని మిర్చి రైతుల సమస్యల పరిష్కారానికి కేంద్రంపై ఒత్తిడి తేనున్నట్టు రాష్ట్ర వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలో ఆయన సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంతో ఈ అంశం పై చర్చించేందుకు మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నట్టు తెలిపారు. సిఎం చంద్రబాబు కూడా అదే సమయంలో అక్కడ ఉంటారని, మిర్చి రైతుల సమస్యలను కేంద్ర మార్కెటింగ్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్టు తెలిపారు. ఒత్తిడి తీసుకురావడం ద్వారా సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఉద్యానవన పంటల్లో ఆధునిక పద్ధతులపై కూడా ఆయన అధికారులతో చర్చించారు.