రాష్ట్రీయం
భీమవరం మావుళ్లమ్మకు వజ్రాల మంగళసూత్రాలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 10 January 2016
భీమవరం, జనవరి 9: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వేంచేసియున్న శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి ఒక అజ్ఞాత భక్తుడు వజ్రాలు పొదిగిన బంగారు మంగళసూత్రాలను బహూకరించాడు. కిలో బంగారంతో వీటిని తయారుచేశారు. వీటి విలువ సుమారు రూ.25 లక్షలు. ఈ నెల 11వ తేదీన అమ్మవారికి వీటిని అలంకరిస్తామని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయలు శనివారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ప్రకటించారు. అమ్మవారి స్వర్ణ వస్తన్రిధి సేకరణలో భాగంగా అమ్మవారికి ఇప్పటికే 60 కిలోల బంగారంతో శూలం, ఢమరుకం, కత్తి, గరగ, పాదాలు తదితర ఆభరణాలను తయారుచేయించి అలంకరించామన్నారు.
అమ్మవారికి బహూకరించిన వజ్రాలు పొదిగిన బంగారు మంగళ సూత్రాలు